Anantapur Updates: వాటర్ వర్క్ లో పనిచేస్తున్న సిద్దయ్య ను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు..
అనంతపురం:
-ఎస్కే యూనివర్సిటీ లో వాటర్ వర్క్ లో పనిచేస్తున్న సిద్దయ్య ను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు.
-రెండేళ్లుగా విధులకు హాజరు కాని సిద్దయ్య
-కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల ధ్రువపత్రం సమర్పణ
-విచారణ లో ఎటువంటి అనారోగ్యం లేదని నిర్ధారణ.
Anantapur Updates: ఉత్తమ స్టేషన్ మేనేజర్ గా పుట్టపర్తి మేనేజర్ రామాంజనేయ గౌడుకి అవార్డు..
అనంతపురం..
-అనంతపురం బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉత్తమ స్టేషన్ మేనేజర్ గా పుట్టపర్తి మేనేజర్ రామాంజనేయ గౌడుకి అవార్డు
-2019 - 2020 సంవత్సరానికి ఉత్తమ అవార్డుకు ఎంపికైన రామాంజనేయ గౌడ్
Anantapur Updates: మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు..
అనంతపురం:
-సోమందేపల్లె లో మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.
-పలుచోట్ల 50శాతానికి పైగా పట్టు ముడిసరుకు వినియోగిస్తున్నారని గుర్తించిన అధికారులు
Kadapa Updates: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కేసులో కదలిక...
కడప :
-మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో కదలిక...
-హైకోర్టు ఆదేశాలతో మూడో దఫా విచారణ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్న సిబిఐ...
-వివేకా హత్యకేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు...
-రెండు, మూడు రోజుల్లో సీబీఐ అధికారులు తిరిగి జిల్లాకు వచ్చి అవకాశం
-జిల్లాకు వచ్చిన అనంతరం పులివెందుల కోర్టు నుంచి రికార్డులు తీసుకునే అవకాశం ...
-ముగ్గురు అనుమానితుల నార్కో పరీక్షల నివేదిక, వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ వివరాలను కూడా పులివెందుల కోర్టు నుంచి తీసుకునే అవకాశం...
Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,792 మంది భక్తులు.
-తలనీలాలు సమర్పించిన 9,896 మంది భక్తులు.
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు.