Live Updates: ఈరోజు (12 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 12 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి సా.6-24 తదుపరి త్రయోదశి | హస్త నక్షత్రం రా.12-04 తదుపరి చిత్త | వర్జ్యం ఉ.9-25 నుంచి 10-56 వరకు | అమృత ఘడియలు సా.6-26 నుంచి 7-56 వరకు | దుర్ముహూర్తం ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
తూర్పుగోదావరి :
కొత్తపేట
-కోవిడ్ ఆంక్షల నేపధ్యంలో నలుగురికి మాత్రమే అనుమతులు జారీ చేసిన అధికారులు..
-నిబంధనలు ఉల్లంఘిస్తూ పదుల సంఖ్యలో వెలసిన అక్రమ బాణాసంచా దుకాణాలు..
-భధ్రత ప్రమాణాలు గాలికి వదిలేసిన వ్యాపారులు.. పట్టించుకోని ఫైర్, పోలీస్, రెవెన్యూ అధికారులు..
విజయవాడ..
-దివ్య తేజస్విని హత్య కేసులో నాగేంద్ర కష్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
-ఆర్డర్స్ వచ్చే సోమవారానికి రిజర్వ్ చేస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు
-అరెస్టు చేసి రిమాండ్ లో ఉన్న నాగేంద్రను వారం రోజులు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసిన బెజవాడ పోలీసులు
తిరుమల..
-శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు
-రేపు ఉదయం 11.00 గంటలకు టీటీడీ ఆన్ లైన్ (వర్చువల్) కోటాను విడుదల
-ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలి
-తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ కోటాను ప్రతి నెల చివరి వారంలో టీటీడీ విడుదల చేస్తుంది.
-శ్రీవారి దర్శనం కోటాను, దర్శనం స్లాట్లను క్రమబద్ధీకరిస్తూ రోజువారి దర్శనం టోకెన్లను భక్తులకు మంజారు
విశాఖ..
-శ్రీలంక తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుండి 1.5 km ఎత్తు వరకు కొనసాగుతున్న ద్రోణీ...
-దీని ప్రభావంతో ఉత్తర కోస్తా లో భారీ వర్షాలు
-తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు అక్కడ అక్కడ వర్షాలు..
-ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు...
-16,17 తేదీల్లో కోస్తాంధ్ర లో వర్షాలు..
తిరుమల..
-భారత దేశంలోనే సహజ వనరులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వామి వారు ఆశీర్వదించాలి.
-రాష్ట్రాన్ని నెంబరు 1 రాష్ట్రంగా తీర్చిద్దాడానికి అనేక రంగాలు ఉన్నాయి.
-రాయలసీమను రత్నాల సీమగా, ఉత్తరాంధ్రలో అద్భుతమైన భూ సంపద, మధ్యాంద్రలో నీటి వనరులు ఉన్నాయి.
-ఇంతటి మంచి వనరులు కలిగిన ప్రాంతాన్ని రాష్ట్ర అభివృద్ధికి పాలకుల మనస్సులో వుండాలని స్వామి వారిని కోరుకున్నా.
-స్వామి వారి సొమ్ముపై ప్రభుత్వాల కన్ను పడుతున్నాయి, వారి కళ్ళు ప్రజలు ఇచ్చే కానుకలపై పడకూడదు.
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి , పరిపాలకులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని స్వామి వారిని ప్రార్ధించాను - సోమువీర్రాజు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు
విశాఖ...
-కూలీలను తీసుకు వెళ్తున్న రైలీంగ్ ను ఢీ కొని బొలెరో బోల్తా.
-ఘటనా స్థలంలోనే ఇద్దరు కూలీలు మృతి, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు.
-పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం. మృతులను తాడిచెట్ల పాలెంకు చెందిన మోహన్,గాజువాకకు చెందిన శేఖర్ గా గుర్తింపు.
-గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు .
కడప :
-రైల్వే గేటును ఢీకొని, ఇంట్లోకి దూసికెళ్లిన లారీ...
-లారీ డ్రైవర్ అక్కడిక్కడే మృతి..
-తప్పిన పెను ప్రమాదం..
-క్రేన్ సహాయంతో లారీని తీస్తున్న పోలీసులు..
గుంటూరు..
-అప్పర్ క్యాస్ట్ వాళ్లు మనని వాడుకొంటున్నారంటూ ఫోన్ ఆడియో...
-ఆడియోలో రెడ్డి సామాజిక వర్గాన్ని తూరుపారపట్టిన శ్రీదేవి.
-ఎస్సీలు, బి.సి.లు ఒకటిగా ఉండాలి రెడ్లు అనేవాళ్లు డేంజర్ అంటున్న శ్రీదేవి.
-స్థానిక నేతలతో తనకు ఉన్న విభేదాలను భయట పెట్టినట్లు ఉన్న ఆడియో...
కర్ణాటక:
-బెంగళూరులో లష్కరే తోయిబా అనుమానిత తీవ్రవాది సయ్యద్ ఎం ఇద్రీస్ అరెస్టు
-ఆన్లైన్లో తీవ్రవాద శిక్షణ పొందేందుకు యువత ను ఎంపిక చేస్తున్నట్లు గుర్తించిన ఎన్ ఐ ఏ
-యువకులను స్లీపర్ సెల్స్ గా వినియోగించుకుంటున్నారని గుర్తించిన అధికారులు
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 9970 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 6750 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 74.915 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టిఎంసిలు.