Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-04 02:18 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి

ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬

తాజావార్తలు

Live Updates
2020-11-04 14:54 GMT

- ఇందిరభవన్ లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం ప్రారంభం..

- పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్,         డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్.

2020-11-04 14:50 GMT

- ఖైరతాబాద్ చింతల్ బస్తీలో పీఎం స్వనిది కింద స్ట్రీట్ వెనడర్స్ కు గుర్తింపు కార్డులు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,హాజరైన ఖైరతాబాద్     మాజీ ఎమ్మెల్యే    చింతల రామచెంద్రారెడ్డి.

- కిషన్ రెడ్డి..కేంద్ర మంత్రి.

- చిన్న వ్యాపారస్తుల కష్టాలు మోడీ గారికి తెలుసు కాబట్టే స్ట్రీట్ వెండర్స్ స్వనిధి పథకం పెట్టారు.

- నేడు గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి 10,000 ఆర్థిక రుణ సాయం అందుతుంది.

- వ్యాక్సిన్ వచ్చే వరకూ మాస్కులు శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి.

- చిన్నపిల్లలను వృద్ధులను కరోనా నుంచి కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది.

- స్వనిది కింద 10వేలు రుణ సాయాన్ని పొంది, తిరిగి కట్టిన వాళ్లకు 30 వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది.

2020-11-04 14:42 GMT

హైదరాబాద్.. 

- నకిలీ పులి చర్మం అమ్ముతున్న షరీఫ్ అనే వ్యక్తి నీ అరెస్ట్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..

- ఒరిజినల్ పులి చర్మం అని నమ్మించి 5 లక్షలకు నకిలీ పులి చర్మం అమ్మిన షరీఫ్..

- షరీఫ్ ను లంగర్ హౌస్ వద్ద అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...

2020-11-04 13:58 GMT

* కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ని బుజ్జగించడానికి రంగంలో దిగిన కాంగ్రెస్ అధిష్టానం.

* పార్టీ సీనియర్లు ఎవరులేకుండానే విజయశాంతి తో భేటీ అయిన మనిక్కం.

* ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్ సాయంత్రం విజయశాంతి తో భేటీ.

* దాదాపు గంటపాటు విజయశాంతి తో భేటీ అయిన మనిక్కం ఠగూర్.

* కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవమానం గురించి మనిక్కం ఠాగూర్ కు రాములమ్మ వివరించినట్లు సమాచారం.

2020-11-04 13:13 GMT

హైదరాబాద్...

- గ్రేటర్ లో బీసీ లకు 50 శాతం సిట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

- మద్దతు పలికిన జానారెడ్డి, చిన్నారెడ్డి

- రెడ్డి లు అయినా... బీసీ లకు 50 శాతం సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన జీవన్ రెడ్డి. జనారెడ్డిలకు అభినందనలు తెలిపిన హన్మంత రావు

2020-11-04 13:09 GMT

- 50 శాతం సీట్లు బీసీ లకు ఇవ్వాలని నిర్ణయం

- బీసీ రిజర్వేషన్ పై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం

- న్యాయ పోరాటం...రాజకీయ పోరాటం

- 7 న మహిళలు..దళితులపై దాడులకు నిరసన గా ధర్నా

- 11న ఖమ్మం లో ట్రాక్టర్లు తో రైతు ర్యాలీ

- 12 న జిల్లా కేంద్రాల్లో రైతు కోసం దీక్ష .. రైతు సమస్యలపై

- గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద

- జనరల్ సీట్లలో పోటీ చేసే వారికి 10 వేలు

- నాన్ జనరల్ 5 వేలు చెక్కులు రూపంలో పార్టీకి ఇవ్వాలి.

- సన్నరకం వడ్లకు 2500 మద్దతు ధర ఇవ్వాలి

- రైతు సమస్యలపై ఉద్యమానికి శాశ్వత కమిటీ వేయాలని నిర్ణయం

2020-11-04 11:24 GMT

ములుగు జిల్లా..

-తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకున్న మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు, సినీ హాస్యనటుడు బాబుమోహన్.

-గిరిజన సాంప్రదాయం ప్రకారం ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికారు.

-దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అధిక మెజారిటీతో గెలవాలని తల్లులను మొక్కకున్నట్లు తెలిపిన బాబుమోహన్.

2020-11-04 11:22 GMT

భద్రాద్రికొత్తగూడెం జిల్లా:

కొత్తగూడెం...

-ప్రగతి మైదానంలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపన్ని ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

-పాల్వంచ నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని పరిశీలించిన రాష్ట్ర రోడ్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..

-ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి , ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్,......

2020-11-04 11:09 GMT

జహీరాబాద్.. 

-10,000 మంది రైతులకు ఊరట

-జహీరాబాద్ ప్రాంతంలో భారీగా చెరుకు సాగు

-రైతులతో అగ్రిమెంట్ చేసుకోని ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ

-ఆ ప్రాంత చెరుకును సంగారెడ్డి గణపతి షుగర్స్‌కు తరలించాలని నిర్ణయం

-అదే సమయంలో ఈ ప్రాంత రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం

-సంగారెడ్డి రైతులకు చెల్లించే ధరనే జహీరాబాద్ ప్రాంత రైతులకూ వర్తింపజేయాలని తెలిపిన మంత్రి

-ట్రైడెంట్ పరిశ్రమ చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని ఆదేశం

-లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిక

-రైతులకు రావాల్సిన బకాయిలు అణాపైసాతో చెల్లించేలా చర్య తీసుకుంటాం: మంత్రి హరీష్ రావు

-రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

2020-11-04 11:06 GMT

హైదరాబాద్:

- ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి మంత్రి కె.టి.ఆర్. బందువులమని బెదిరింపులు..

- ఎల్బీ నగర్ లో నిన్న అర్ధరాత్రి ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి...

- ఎల్బీనగర్ లోని సితారలో జరిగిన ఫంక్షన్ కు వచ్చిన కొంత మంది పక్కనే ఉన్న ఆటోలు, సుమోలపై బీర్ బాటిల్స్ పెట్టి తాగుతుండగా

- ఇదేంటని అడిగిన ఆటో డ్రైవర్ల పై దాడి రాము కెటిఆర్,కన్నారావు మనుషులమని తమను ఏ పోలీస్ ఎం చేయలేదని బెదిరింపులు

- పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు.

- ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Tags:    

Similar News