Live Updates: ఈరోజు (సెప్టెంబర్-04) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-04 01:01 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 04 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-విదియ (మ.12-17వరకు) తదుపరి తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం (రా.10-37 వరకు) తదుపరి రేవతి, అమృత ఘడియలు (సా.5-21 నుంచి 7-07 వరకు) వర్జ్యం (ఉ.6-51 నుంచి 8-36 వరకు) దుర్ముహూర్తం (ఉ.8-17 నుంచి 9-06 వరకు తిరిగి మ.12-24 నుంచి 1-13 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-10

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-09-04 12:55 GMT

తూర్పుగోదావరి....

పెద్దాపురం....

-మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామేంట్స్...

-వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయి.

-వాటిని ప్రక్కకు పెట్టి రైతుల ఆత్మహత్యల పాపం తెలుగుదేశం పార్టీదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనడం హాస్యాస్పదంగా ఉంది.

-గత 15 నెలలుగా వైసిపి ప్రభుత్వం తప్పిదాల కారణంగానే అన్నదాత ల ఆత్మహత్యలు పెరిగాయి.

-వైకాపా ప్రభుత్వం 15 నెలల పాలనలో రైతులు రూ.50 వేల కోట్లు నష్టపోయారు.

-ఈ అనాలోచిత నిర్ణయంతో చిన్న, సన్నకారు, కౌలు రైతులు నష్టపోతారు.

2020-09-04 12:07 GMT

విజయవాడ..

-9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

-అక్టోబర్ 17 వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

-18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా...

-19న శ్రీ గాయత్రీ దేవిగా,

-20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా ,

-21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా,

-23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

-25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం...అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం

-కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం

-గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు

-ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్న దుర్గగుడి అధికారులు

2020-09-04 11:49 GMT

అమరావతి...

-జడ్జి రామకృష్ణ ఇంటి ముందు రోడ్డుపై నడవొద్దంటూ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులపై నేడు హైకోర్టులో జరిగిన విచారణ

-జడ్జి రామకృష్ణకు నోటీసుల అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరిన న్యాయవాది శ్రావణ్ కుమార్

-ఇప్పటికే జడ్జి రామకృష్ణకు తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు

-తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా

2020-09-04 11:42 GMT

అమరావతి..

-భద్రతా కారణాలతో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించిన ప్రభుత్వం

-ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు కన్నబాబుకు బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించిన హోం శాఖ.

-10 రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ వాహనం కేటాయించాలన్న ఇంటెలిజెన్స్ వర్గాలు.

-బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రి కన్నబాబుకు ఇంటెలిజెన్స్ వర్గాల సూచన.

-ఇంటెలిజెన్స్ సూచనల మేరకు రెండు రోజులుగా బులెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటిస్తోన్న మంత్రి కన్నబాబు.

2020-09-04 11:16 GMT

గుంటూరు ః...

-2016 లో డబ్బులు వసూలు చేసి నేటికి ఇవ్వని ప్లాట్ లు.

-ప్లాట్ లు గురించి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు....

-ప్లాట్ లకు సంబందంలేని వ్యక్తులతో ఎస్సీ , ఎస్టీ కేసులు పెట్టి వేదిస్తున్నారు.

-స్దలం డెవలప్మెంట్ కు వచ్చిన వారిని సైతం బెదిరిస్తున్న బిల్డర్ లు.

-బిల్డర్ మంచికలపూడి శ్రీనివాసరావు , ఆలపాటి గోపాలకృష్ణ లపై చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి...

2020-09-04 11:12 GMT

అమరావతి..

-రాజమహేంద్రవరం వైశ్య సేవా సాధన్ భూములు పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

-సుమారు 32 ఎకరాలను ఇళ్ల పట్టలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు

-విచారించిన హైకోర్టు... నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ

2020-09-04 10:41 GMT

అమరావతి:

-నా ప్రత్యక్ష దైవం టిడిపి అధినేత చంద్రబాబు గారు ఇచ్చిన దైర్యం, అభిమానుల ప్రార్థనలతో కరోనా నుండి త్వరగా కోలుకున్నాను.

-పదవులు శాశ్వతం కాదు. నాయకుడ్ని నమ్ముకొని ముందుకు వెళ్లడమే నా సిద్ధాంతం.

-కష్ట కాలంలో చంద్రబాబు గారు ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువను.

2020-09-04 10:37 GMT

అనంతపురం:

-మంత్రి సోదరుడు మల్లికార్జునకు వ్యతిరేకంగా గోరంట్లలో అసమ్మతి నేతల ప్రత్యేక సమావేశం.

-గంపల రమనారెడ్డి, రామచంద్రారెడ్డి, గంగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, పలువురు ముఖ్య నేతలు హాజరు, సుమారు వంద మంది తో సమావేశం.

-నాలుగు రోజులుగా గోరంట్ల లో అసమ్మతి నేతల వరస సమావేశం.

-మల్లికార్జున అభివృధ్ధికి అడ్డూపడుతూ కమిషన్లు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ.

-భూ కబ్జాలు, కమీషన్లకు అలవాటు పడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.

-పేదల భూములపై మల్లికార్జున కన్నేసాడు

-గోరంట్ల లో జరుగుతున్న అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుపోతాం.

-పెనుకొండ నియొజకవర్గం లో ఉన్న అసమ్మతి నేతలతో కలిసి త్వరలో పాదయాత్ర చేస్తాం: గంపల రమణారెడ్డి

2020-09-04 10:04 GMT

అమరావతి..

-కొడాలి నాని-పౌరసరఫరాల శాఖ మంత్రి

-రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమని అడిగితే చంద్రబాబు రైతులను భాషిర్బాగ్ లో కాల్చి చంపారు.

-వైస్సార్ పాలన గుర్తు చేసెల సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు.

-రైతులకు భవిష్యత్ లో న్యాయం చేసేందుకు మెగా సోలార్ ప్రాజెక్టు చేపడుతున్నాం.

-చంద్రబాబు వ్యవసాయం చేశాడా రైతుల కష్టాలు తెలియడానికి ?

-అచ్చెన్నాయుడుని ఎవరు హింసించారు?

-అచ్చెన్నాయుడు రాసిన లేఖ ఆధారంగానే అధికారులు…

2020-09-04 09:56 GMT

విజయవాడ..

-పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు

-సృష్టి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రత లైసెన్సు 2018లోనే రద్దు చేసిన MCI

-వేరే వాళ్ళ లైసెన్స్ లతో బెజవాడలో సృష్టి ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు

-DMHOలు పరిశీలన చేయకుండా రెగ్యులర్ మానిటరింగ్ లేకుండా రెన్యూవల్ చేస్తున్నట్టు గుర్తింపు

-ఆస్పత్రిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCIకి రిపోర్ట్

-తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2018లో ఐదేళ్ల పాటు సృష్టికి లైసెన్స్ రద్దు


Tags:    

Similar News