తెలంగాణ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,137 మంది విద్యార్థుల ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్ పూర్తి చేశామని.. 19,788 జవాబు పత్రాల స్కానింగ్ పూర్తి కావాల్సి ఉందని తెలిపింది. ఈ రాత్రికి, లేదా రేపు అప్లోడ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. రీవెరిఫికేషన్లో 552 మంది ఇంటర్ సెకండియర్, 585 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.