Bangladesh: అంకుల్ గారు..ఇక ఆపండి.. ఎగిరి తంతే ఎక్కడపడతారో తెలియదు.. హద్దు దాటేసిన బంగ్లాదేశ్!
Bangladesh: ఒకవైపు భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకుంటున్న తరుణంలో, ఇటువంటి ప్రవర్తన ప్రాంతీయ స్థిరత్వానికి గండిపెడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Bangladesh: అంకుల్ గారు..ఇక ఆపండి.. ఎగిరి తంతే ఎక్కడపడతారో తెలియదు.. హద్దు దాటేసిన బంగ్లాదేశ్!
Bangladesh: పహల్గాం ఉగ్రదాడికి భారత స్పందన నేపథ్యంలో భారత్పై యుద్ధకాండను సూచిస్తూ బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. మాజీ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజ్లుర్ రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తాత్కాలికంగా అధికారంలో ఉన్న ముహమ్మద్ యూనుస్కు అతి సన్నిహితుడిగా వ్యవహరించే వ్యక్తి నుంచి రావడంతో మరింత సంచలనంగా మారాయి.
ఫేస్బుక్ వేదికగా ఫజ్లుర్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, భారత్ పాక్పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ చైనాతో చేతులు కలిపి భారత తూర్పు భాగాలను ఆక్రమించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ—ఇది ప్రభుత్వ అధికారిక స్థానం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం దీనిని సమర్థించడం లేదని స్పష్టంగా పేర్కొంది.
ఈ వ్యాఖ్యలు యూనుస్కు ఇబ్బంది కలిగించగా, దౌత్య సంబంధాలపరంగా భారత్–బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే ఏర్పడిన బీభత్స వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి. యూనస్ మునుపు చైనాలో ఓ సమావేశంలో మాట్లాడుతూ, భారత తూర్పు రాష్ట్రాలు పూర్తిగా బంగ్లాదేశ్ మీద ఆధారపడి ఉండాయని చెప్పడం, బంగ్లాదేశ్ను "ఇండియన్ ఓషన్కు గేట్వే"గా వ్యాఖ్యానించడం అప్పటికే వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్కి ఇచ్చిన ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాన్ని రద్దు చేసింది. ఇదే సమయంలో నేపాల్, భూటాన్కి వెళ్ళే ఎగుమతులపై మాత్రం మినహాయింపు కొనసాగుతోంది, WTO నియమాల ప్రకారం.
యూనస్ పాలనలో మైనారిటీలపై కొనసాగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, హిందూ మైనారిటీలపై ఉద్ధృతమైన దాడులు భారత ఆందోళనకు ప్రధాన కారణంగా మారాయి. ప్రస్తుతం, బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్గతంగా ఆస్తిరంగా ఉండడం, చైనా లాంటి దేశాలతో అనుబంధం పెంచుకునే యత్నాలు చేయడం, భారత్తో సంబంధాలను మరింత దిగజార్చే పరిస్థితులను కలిగిస్తున్నాయి. ఒకవైపు భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకుంటున్న తరుణంలో, ఇటువంటి ప్రవర్తన ప్రాంతీయ స్థిరత్వానికి గండిపెడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.