వైసీపీ ఫిరాయింపు ఎంపీలకు ఝలక్ .. వేటు వేసేందుకు సిద్ధమైన లోక్‌సభ స్పీకర్ ?

Update: 2018-06-06 07:19 GMT

వైసీపీ నుంచి గెలిచి టీడీపీ, టీఆర్ఎస్‌లలోకి ఫిరాయించిన ఎంపీలపై చర్యలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్‌తో సమావేశమయిన వైసీపీ ఐదుగురు ఎంపీలు ఫిరాయింపుదార్ల అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటానంటూ హామి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి, బుట్టారేణుక టీడీపీలో చేరగా .. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. స్పీకర్‌ నిర్ణయంతో ఈ నలుగురిపై అనర్హత వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Similar News