వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

Update: 2018-07-16 05:00 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాసంప్రోక్షణ  పేరుతో తిరుమల ఆలయాన్ని తొమ్మిది రోజులు పాటు మూసివేయడంపై పలు అనుమానాలకు  తావిస్తోందని ఆరోపించారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించకపోవడం దారుణమన్నారు.  వెంకన్నను దర్శించుకోవడం కుదరదు కొండకు రావొద్దని టీటీడీ చెప్పడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.  టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 

Similar News