'చిత్రం' వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. 'నువ్వునేను', 'జయం' చిత్రాల విజయాలతో సంచలన దర్శకుడు అనిపించుకున్నాడు. అయితే ఆ తరవాత వరుస పరాజయాలు పలకరించాయి. 15 ఏళ్ల తరువాత మళ్లీ 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్ కొట్టాడు తేజ. రానా, కాజల్ జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ తమిళంలోకి కూడా అనువాదమౌతోంది. 'నాన్ ఆనైయిట్టాల్' పేరుతో అక్కడ విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. 'నేనే రాజు నేనే మంత్రి' తరువాత తేజ తదుపరి చిత్రంపై ఫిల్మ్నగర్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్తో బాలకృష్ణ చేయబోయే చిత్రానికి తేజనే దర్శకుడు అనేది ఒక వార్త అయితే.. కాదు, వెంకటేష్తో తేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందన్నది మరో వార్త. మరి వీటిలో ఏది కార్యరూపం దాలుస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.