'పందెం కోడి', 'పొగరు', 'పూజ' తదితర చిత్రాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నారు తమిళ కథానాయకుడు విశాల్. స్వతహాగా తెలుగువాడైన విశాల్.. తమిళ చిత్రాలకే పరిమితమైనా.. తన ప్రతి చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరిస్తుంటారు. ఇదిలా ఉంటే.. గత గురువారం విడుదలైన విశాల్ తాజా చిత్రం 'తుప్పరివాలన్' తమిళనాట వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని 'డిటెక్టివ్' పేరుతో త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహించారు.