గత వారం విడుదలైన తమిళ చిత్రం 'తుప్పరివాలన్'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కథానాయకుడు విశాల్. ప్రస్తుతం ఆయన మూడు తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే 'ఇరుంబు తిరై', 'కరుప్పు రాజా వెల్లై రాజా', 'సండ కోళి2'. వీటిలో 'ఇరుంబు తిరై' ముందుగా విడుదలయ్యే అవకాశముంది. ఈ చిత్రంలో విశాల్కి జంటగా సమంత నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
తమిళనాట వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది. సూర్య కొత్త చిత్రం 'తానే సేరంద కూట్టమ్' కూడా పొంగల్కే రానుంది. అంటే.. సూర్యకి పోటీగా విశాల్ కూడా పొంగల్ బరిలోకి దిగుతున్నాడన్నమాట. ఇదిలా ఉంటే.. విశాల్ నటించిన తొలి మలయాళ చిత్రం 'విలన్' దీపావళికి విడుదల కానుంది. ఇందులో మోహన్ లాల్, రాశిఖన్నా, హన్సిక ముఖ్య పాత్రలు పోషించారు.