‘విజయ్‌మాల్యాను చంద్రబాబు కలిశారు’

Update: 2018-04-02 08:47 GMT

 సీఎం చంద్రబాబుపై విజయసాయి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 2016 మార్చిలో మాల్యాను లండన్‌లో చంద్రబాబు కలిశారని ఆరోపించారు. పార్టీ కోసం 150 కోట్ల విరాళం తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంపై చంద్రబాబు  స్పందించకపోతే తాను చేసిన ఆరోపణలు నిజమే అని నమ్మాల్సి వస్తుందని విజయసాయి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వస్తున్నది కూడా రాజకీయ లబ్ధకోసమేనని అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను చంద్రబాబు మొదలు పెట్టారని అయితే గత నాలుగేళ్లుగా మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబుపై సభాహక్కుల నోటీసులు ఇచ్చామని విజయసాయి తెలిపారు.

Similar News