'ఎవడే సుబ్రమణ్యం', 'పెళ్లిచూపులు' చిత్రాలతో పరిశ్రమ దృష్టిలో పడ్డ విజయ్ దేవరకొండ.. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సంచలనం సృష్టించాడు. ఆ చిత్రంలోని టైటిల్ రోల్ లో విజయ్ నటన విమర్శకులను, ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను సైతం మెప్పించింది. ఈ సెలబ్రిటీల జాబితాలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా ఉన్నారు. కేవలం విజయ్ నటనని మెచ్చుకోవడమే కాకుండా.. తన తదుపరి చిత్రంలో విజయ్కి ఆఫర్ కూడా ఇచ్చారని తమిళనాట వార్తలు వినిపించాయి.
అరవింద్ స్వామి, జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్న మల్టీస్టారర్ మూవీలో విజయ్ దేవరకొండకి కూడా ఓ పాత్ర దక్కిందని కొన్ని వెబ్సైట్స్లో కథనాలు వినిపించాయి. అయితే ఈ చిత్రంలో కాకుండా దీని తరువాత తీసే సినిమాలో మణిరత్నం.. విజయ్ని హీరోగా ఎంచుకున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజమున్నది త్వరలోనే తెలుస్తుంది.