'నేను శైలజ'వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు రామ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ చిత్రంలో రాక్ స్టార్గా కనిపించబోతున్నాడు రామ్. ఇందుకోసం గిటార్ పాఠాలు కూడా నేర్చుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇటలీలోని మిలన్లో రామ్పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న లేదా నవంబర్ మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్రవంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ గత చిత్రం 'హైపర్' ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో 'ఉన్నది ఒకటే జిందగీ' విజయం రామ్కి కీలకంగా మారింది.