'నేను శైలజ', 'నేను లోకల్' చిత్రాలతో రెండు వరుస విజయాలను సొంతం చేసుకుంది కేరళకుట్టి కీర్తి సురేష్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ చిత్రంతో పాటు 'మహానటి'లో మహానటి సావిత్రి పాత్రలో నటిస్తూ బిజీగా ఉందీ ముద్దుగుమ్మ. అంతేకాకుండా.. తమిళంలోనూ సినిమాలు చేస్తున్న కీర్తి ప్రస్తుతం అక్కడి అగ్రకథానాయకుల్లో ఒకరైన సూర్యతో కలిసి 'తాన సేరండ్ర కూట్టమ్' అనే సినిమాలో నటిస్తోంది.
విశేషమేమిటంటే.. పవన్ 25వ చిత్రం, 'తాన సేరండ్ర కూట్టమ్' సంక్రాంతి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు రావడం. సంక్రాంతి టైంలో కీర్తి సినిమాలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కీర్తి నటించిన తమిళ చిత్రం 'రజనీ మురుగన్', 2017లో 'భైరవ' అనే మరో తమిళ చిత్రం విడుదలయ్యాయి. ఈ సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాలతో కీర్తి పలకరిస్తుందన్నమాట. అగ్ర కథానాయకులతో కలిసి నటించిన ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే.. రెండు భాషల్లోనూ కీర్తి రేంజ్ మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.