అభివృద్ధిని చూసి ఓటెయ్యాలంటూ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపు

Update: 2018-11-12 12:26 GMT

నాయకులను కాకుండా అభివృద్ధిని చూసి ఓటెయ్యాలంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి లక్ష్మారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజాపూర్‌ మండలం పొట్లపల్లి, గుండ్లపొట్లపల్లి, కల్లేపల్లితో పాటు గిరిజన తండాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డప్పు వాయిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకే ఓటెయ్యాలని మంత్రి లక్ష్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 
 

Similar News