సినీనటుడు సామ్రాట్‌పై వరకట్న వేధింపులు

Update: 2018-01-30 06:46 GMT

సినీనటుడు సామ్రాట్‌రెడ్డిపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్లో వరకట్న వేధింపులు, చోరీ కేసు నమోదైంది. గత కొంతకాలంగా సామ్రాట్‌రెడ్డి, ఆయన భార్య స్వాతిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో తాను ఇంట్లో లేనప్పుడు సీసీ కెమెరాను ధ్వంసం చేసి బంగారం తీసుకుపోయినట్టు సామ్రాట్ భార్య స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సామ్రాట్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామ్రాట్‌, హర్షితలకు రెండేళ్ల కిందట పెళ్లైంది. కలహాల కారణంగా వారిద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు. గతంలో సామ్రాట్‌పై రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 498/ఏ చట్టం కింద కేసు నమోదయింది. మాదాపూర్‌లో హర్షిత ఉంటున్న ఇంట్లో సామ్రాట్‌ దొంగతనానికి పాల్పడ్డాడన్నది తాజా ఆరోపణ. ఇంట్లో ఎవరూలేని సమయంలో సామ్రాట్‌ లోపలికి ప్రవేశించి, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశాడని, ఆభరణాలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడని భార్య హర్షితారెడ్డి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Similar News