'మనం' చిత్రంలో తల్లీకొడుకులుగా నటించిన సమంత, అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం 'రాజు గారి గది2' చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్ మెంటలిస్ట్ పాత్రలో నటిస్తుండగా, సమంత ఆత్మ పాత్రలో నటిస్తుండడం విశేషం. సీరత్ కపూర్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2015లో వచ్చిన 'రాజుగారి గది'కి కూడా ఓంకార్నే దర్శకుడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏ టైంలో విడుదల చేయబోతున్నారో కూడా చిత్ర బృందం ప్రకటించింది. రేపు ఉదయం 10 గం|| 30 ని|| లకి 'రాజుగారి గది2' ట్రైలర్ని విడుదల చేయనున్నారు. థమన్ సంగీతమందిస్తున్న 'రాజుగారి గది2'ని దీపావళి కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు.