2016లో జరిగిన ఓ విషయమే.. 2017లోనూ సమంతకి రిపీట్ కాబోతోంది. కాస్తవివరాల్లోకి వెళితే.. 2016లో సూర్య త్రిపాత్రాభినయం చేసిన '24' చిత్రంలో ఓ హీరోయిన్గా నటించిన సమంత.. ఇప్పుడు విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్న 'మెర్సల్' చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్లో ఒకరిగా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలను గమనిస్తే.. ఆయా హీరోల త్రిపాత్రాభినయంతో పాటు మరో రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సమంతకి.
అవేమిటంటే.. రెండు చిత్రాలలోనూ తన సహ నటి నిత్యా మీనన్ ఓ కీలక పాత్రలో సందడి చేయడం ఒకటైతే.. ఈ రెండు చిత్రాలకి కూడా డబుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించడం మరొకటి. '24' చిత్రం అంచనాలను అందుకోవడంలో పూర్తిస్థాయిలో ఓకే అనిపించుకోలేకపోయింది. మరి 'మెర్సల్' చిత్రమైనా ఘన విజయం సాధిస్తుందో లేదో చూడాలి. దీపావళి కానుకగా రానున్న 'మెర్సల్' తెలుగులోనూ 'అదిరింది' పేరుతో అనువాద రూపంలో సందడి చేయనుంది.