తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతుందని ముందే చెప్పానన్నారు సీఎం కేసీఆర్. అనుకున్నట్టుగానే తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యింది. దేవుడి దయ, ప్రజల సహకారం, రాత్రింబవళ్లు పనిచేసే అధికారుల కృషితో ఇది సాధ్యమైంది అని సీఎం కేసీఆర్ చెప్పారు. గత రెండేండ్లుగా తెలంగాణ ఆదాయం 20% పెరిగిందని, ఈ ఏడాది 16.8% పెరుగుదల ఉందని తెలిపారు. రాష్ట్ర సొంత ఆదాయం 20% పెరిగిన రాష్ట్రం దేశంలోనే ఒక్క తెలంగాణేనని చెప్పారు. డల్గా ఉండే ఏప్రిల్లో కూడా పెరుగుదల ఉండటం శుభపరిణామమన్నారు.