జగన్పై జరిగిన హత్యాప్రయత్నం గురించి భిన్నవాదనలు వినిపిస్తున్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీ వై.బి.రాజేంద్రప్రసాద్. జగన్కు ఏదైనా జరిగితే టీడీపీకి ఎలాంటి ఉపయోగం ఉండదని, వైసీపీకి, జగన్ కుటుంబానికి లాభం ఉంటుందని చెప్పారు. అందువల్ల జగన్పై దాడి వెనుక తమకు అనుమానాలున్నాయన్నారు. జగన్ ఇంట్లో వాళ్లను అణగదొక్కుతున్నారని, అందువల్ల వాళ్ల కుటుంబ సభ్యులే కుట్ర చేయించి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తపరిచారు. పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాజేంద్రప్రసాద్.