రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రధాని మోడీని విమర్శిస్తే.. విజయసాయిరెడ్డికి బాధేంటని.. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం చూస్తే.. బీజేపీ, వైసీపీ మధ్య సంబంధం ఏంటో తెలుస్తుందన్నారు. జగన్ రిమోట్ కంట్రోల్.. మోడీ దగ్గర ఉందన్న ఆంజనేయులు.. మాల్యా దగ్గర చంద్రబాబు 150 కోట్లు తీసుకున్నారని చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని సవాల్ విసిరారు.