కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

Update: 2018-11-10 06:49 GMT

కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త సోమేశ్వర గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. దేవనకోండ మండలం కె.వెంకటాపురం శివారులో ఈ ఘటన జరిగింది. సోమేశ్వర గౌడ్‌ను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపేశారు. ఈ దాడిలో ఆయన కుమారుడు శివకు తీవ్రగాయాలయ్యాయి. కుమారుడితో ఇంటికి వెళ్తున్నప్పుడు సోమేశ్వర గౌడ్ కంట్లో కారం కొట్టి ప్రత్యర్థులు చంపేశారు. మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Similar News