ఏపీలో టీడీపీ గ్రాఫ్ పడిపోయింది...

Update: 2018-09-04 06:53 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. విశాఖలో మీడియాలో మాట్లాడిన ఆయన ఏపీ గూండాల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. ఏపీలో టీడీపీ గ్రాఫ్‌ పడిపోయిందని సీఎం చుట్టూ ఉన్న మంత్రుల వల్లే టీడీపీ గ్రాఫ్‌ పడిపోయిందని వ్యాఖ్యానించారు. రైల్వేజోన్‌ వస్తుందని తెలిసి కూడా మంత్రి గంటా అనవసరంగా నిరసనలు చేస్తున్నారని విష్ణుకుమార్‌రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. 

Similar News