దేశ పరిరక్షణ కోసమే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిశాయి-భట్టి

Update: 2018-11-10 04:53 GMT

దేశ పరిరక్షణ కోసమే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిశాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పరిధిలోని టీడీపీ కార్యకర్తల సమన్వయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కలయిక అధికారం కోసమో, పదవుల కోసమో కాదని తెలిపారు. దేశం, రాజ్యాంగం కోసం కలిశామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్ కలిసి, దేశాన్ని కుల, మత, వర్గ, ప్రాంతాలుగా విభజించారని విమర్శించారు. 
 

Similar News