ఇప్పటివరకు తెలుగులోకి డబ్బింగ్ అయిన చిత్రాలతోనే ఇక్కడివారికి చేరువైన ఓ తమిళ దర్శకుడు.. అతి త్వరలో నేరుగా చేస్తున్న తెలుగు సినిమాతో పలకరించనున్నాడు. అయితే.. ఆ సినిమా ద్విభాషా చిత్రం కావడం విశేషం. 'నాపేరు శివ' తదితర డబ్బింగ్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశీంద్రన్.. ప్రస్తుతం సందీష్ కిషన్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు.
'నెంజిల్ తుణివురుందాల్' పేరుతో తమిళంలోనూ.. 'కేరాఫ్ సూర్య' పేరుతో తెలుగులోనూ ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఈ ద్విభాషా చిత్రంతో సుశీంద్రన్ ఖాతాలో మరో విజయం చేరుతుందేమో చూడాలి.