'ధృవ' విజయం మెగాపవర్ స్టార్ రామ్చరణ్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 'ఎవడు' తరువాత సరైన హిట్ లేని చరణ్కి ఈ సినిమా అందించిన విజయం ప్రత్యేకమైనది కూడా. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్చరణ్ 'రంగస్థలం' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. సృజనాత్మక ఆలోచనలకు పెట్టింది పేరైన సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. 'రంగస్థలం' చిత్రానికి ట్యాగ్లైన్ '1985' అనే విషయం తెలిసిందే. విశేషంగా.. రామ్చరణ్ పుట్టిన సంవత్సరం కూడా 1985నే. ఇది యాదృచ్ఛికంగా జరిగినా, కావాలనే జరిగినా ఆసక్తికరంగా నిలుస్తున్న విషయంగానే చెప్పుకోవాలి. సంక్రాంతికి 'రంగస్థలం' విడుదలయ్యే అవకాశముంది. జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.