సూపర్స్టార్ మహేష్బాబు కథానాయకుడిగా నటించిన ద్విభాషా చిత్రం 'స్పైడర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించారు. రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. మహేష్బాబు సినిమాలకు ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే 'స్పైడర్' విషయంలో ఆ క్రేజ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. యుఎస్ఎలో అట్మస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, అజ్ ఇండియా మీడియా సంయుక్తంగా రిలీజ్ చేస్తున్న 'స్పైడర్'కి 26 వ తేది ప్రీమియర్స్ నిర్వహిస్తుండగా.. ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగిందట. సినిమాకి మంచి టాక్ వస్తే.. 'శ్రీమంతుడు' రికార్డులను 'స్పైడర్' అవలీలగా దాటేస్తుందన్నమాట.