కర్నాటకలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ వేసింది. అసెంబ్లీ ఎన్నికలవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారు. లింగాయత్లకు మతం హోదా కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్లకు మతం హోదా కల్పించాలంటూ కేంద్రానికి తీర్మానం చేసి పంపారు. అయితే కర్నాటక సీఎం సిద్ధరామయ్య నిర్ణయంపై మండిపడుతున్న బీజేపీ నేతలు హిందువుల్లో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.