'ఆషిఖీ 2' చూసిన వారెవరైనా ఆ చిత్ర కథానాయిక శ్రద్ధా కపూర్ నటనకి, గ్లామర్కి ఫిదా అవ్వాల్సిందే. అంతగా ఆ సినిమాలో మెప్పించింది శ్రద్ధా. ఆ తరువాత మరికొన్ని హిట్ చిత్రాల్లో మెరిసిన ఈ చిన్నది.. తొలిసారిగా ఓ దక్షిణాది చిత్రం చేస్తోంది. అదే ప్రభాస్ నటిస్తున్న త్రిభాషా చిత్రం 'సాహో'. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో శ్రద్ధా డ్యూయెల్ రోల్ చేస్తుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, తాను రెండు కోణాలున్న పాత్రని మాత్రమే చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రద్ధా. అంతేకాకుండా.. 'సాహో'లో తనది ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని.. యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది. 'సాహో' వచ్చే ఏడాది తెరపైకి రానుంది.