'జంప్ జిలానీ' పేరుతో 2014లో 'అల్లరి' నరేష్ హీరోగా ఓ సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. నరేష్ ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా ఇక్కడ వర్కవుట్ కాలేదు కానీ.. ఆ సినిమాకి ఒరిజనల్ వెర్షన్ అయిన 'కలగలప్పు' తమిళనాట మంచి విజయం సాధించింది.
తెలుగమ్మాయి అంజలితో పాటు విమల్, మిర్చి శివ, ఓవియా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కుష్బూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. 2012లో విడుదలైన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందనుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో జీవా, జై, కేథరిన్ ట్రెసా, నిక్కీ గల్రాణి నటించనున్నారు. సుందర్.సి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.