'ప్రస్థానం' చిత్రంతో నటుడిగా తొలి అడుగులు వేసిన సందీప్ కిషన్.. డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా.. తమిళంలోనూ, హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించాడు. ఇటీవల కాలంలో సందీప్.. తెలుగుతో పాటు తమిళంలోనూ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. తమిళంలో నటించిన చిత్రాలనైతే తెలుగులోకి అదే రోజున వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో సందీప్ హీరోగా నటించిన 'మానగరం' అనే తమిళ చిత్రం 'నగరం' పేరుతో విడుదలైతే.. ఈ నెల 15న తమిళంలో నటించిన 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' పేరుతో రెండు చోట్ల ఒకేసారి రిలీజవుతోంది. ఇక వచ్చే నెల 'నెంజిల్ తుణివురుందాల్' సినిమా తెలుగులో 'కేరాఫ్ సూర్య' పేరుతో ద్విభాషా చిత్రంగా పలకరించనుంది. మొత్తానికి ఒకే ఏడాదిలో మూడు సార్లు తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో సందీప్ తన చిత్రాలతో పలకరించాడన్నమాట.