తొలి చిత్రం 'ప్రస్థానం' నుంచి డిఫరెంట్ రోల్స్ చేయడంపైనే దృష్టి పెడుతున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. కెరీర్లో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మినహాయిస్తే చెప్పుకోదగ్గ విజయమేదీ లేదు సందీప్కి. అయితేనేం.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. ఇక ఈ ఏడాది అయితే జూలై నుంచి నెలకో సినిమాతో నాలుగు నెలల పాటు పలకరించబోతున్నాడు.
జూలైలో 'శమంతకమణి'తో పలకరించిన సందీప్.. ఆగస్టులో 'నక్షత్రం'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక సెప్టెంబర్లో 'ప్రాజెక్ట్ z'తో సందడి చేయనున్నాడు. అలాగే అక్టోబర్లో 'కేరాఫ్ సూర్య'తో పలకరించనున్నాడు. ఈ మధ్య కాలంలో నాలుగు నెలలపాటు కంటిన్యూగా సినిమాలతో పలకరించిన కథానాయకుడు బహుశా సందీప్ నే కావచ్చు.