13 ఏళ్ల క్రితం విడుదలైన 'చెల్లమే' (తెలుగులో 'ప్రేమ చదరంగం')తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు విశాల్. రెండో చిత్రమైన 'సండ కోళి' (పందెం కోడి)తో స్టార్డమ్ తెచ్చుకున్న విశాల్.. ఇప్పుడు తన 25వ చిత్రంగా ఆ సినిమాకి సీక్వెల్ అయిన 'సండ కోళి 2' చేస్తున్నాడు. ఇవాళే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
మొదటి భాగం రూపొందించిన లింగుస్వామినే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన రాజ్ కిరణ్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. తొలి భాగంలో మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించగా.. రెండో భాగంలో కీర్తి సురేష్ నటిస్తోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.