'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జయజానకి నాయక' చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. డైరెక్టర్ శ్రీవాస్ రూపొందిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో.. జగపతిబాబు, శరత్ కుమార్, మీనా వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికి యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వారణాసిలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. 'జయజానకి నాయక'లో హంసలదీవి యాక్షన్ సీన్ ఎలాగైతే హైలెట్ అయ్యిందో అదే విధంగా ఈ సన్నివేశం ఈ సినిమాకి ఎస్సెట్గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంటోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.