రోజా బర్త్ డే స్పెషల్.. రాజన్న క్యాంటీన్లు

Update: 2018-11-17 11:36 GMT

ఏపీ నగరి ఎమ్మెల్యే రోజా పుట్టినదిన వేడుకలు తన కుటుంబసభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. తన నియోజకవర్గమైన నగరిలో తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా తనే స్వయంగా స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజన్న క్యాంటీన్ల పేరుతో 2 మొబైల్ క్యాంటీన్లను ప్రారంభించారు. రూ.4 రూపాయలతో భోజనం అందించనున్నారు. రానున్న రోజుల్లో కూడా మరో రెండు మొబైల్ క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. రోజా మాట్లాడుతూ తన పుట్టినరోజు పేదప్రజలకోరకు క్యాంటీన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది. తన పుట్టినరోజు శుభాక్షాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.

Similar News