అక్కినేని నాగార్జున, సమంత, సీరత్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం 'రాజు గారి గది2'. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. థమన్ సంగీతమందించిన ఈ చిత్రం ట్రైలర్ని ఏఎన్నార్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ ఆవిష్కరించారు.
రాజుగారి గది ట్రైలర్ కోసం క్లిక్ చేయండి
ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను పెంచింది. కళ్లల్లో చూస్తూ గుండెల్లో ఏముందో చెప్పే మెంటలిస్ట్ పాత్రలో నాగ్ దర్శనమివ్వనుండగా.. ప్రతీకారంతో రగిలిపోయే ఆత్మగా సమంత కనిపించనుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, అశ్విన్ తదితరులు నటించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది.