సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్ష నేత జగన్కు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓపెన్ చాలెంజ్ విసిరారు. విశాఖ రైల్వే జోన్ కోసం.. ముగ్గురం కలిసి రైల్ రోకో చేద్దాం.. అప్పుడెందుకు రైల్వే జోన్ రాదో చూద్దామన్నారు. విశాఖ రైల్వే జోన్పై తనకు చిత్తశుద్ధి ఉందని.. తెలుగుదేశం నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. రాజీనామాలు చేసి ముందుకు రావాలన్నారు పవన్. విశాఖ జిల్లా తగరపువలసలో.. టీడీపీ, బీజేపీపై పవన్ విమర్శలు గుప్పించారు.