గోపీచంద్ కొత్త చిత్రం 'ఆక్సిజన్' విడుదల తేది మళ్లీ మారింది. అక్టోబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఇప్పుడు అదే నెల 27కి వాయిదా పడింది. రాశి ఖన్నా, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రం ఆడియోని వచ్చే నెల మొదటివారంలో విడుదల చేయబోతున్నారు.
'లక్ష్యం' తరువాత గోపీచంద్, జగపతిబాబు మరోసారి ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. ముంబయి, చెన్నై, సిక్కిం, గోవా తదితర ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. 'లౌక్యం' తరువాత సరైన హిట్ లేని గోపీచంద్కి ఈ చిత్ర విజయం కీలకంగా మారింది. విడుదల విషయంలో ఇప్పటికే చాలా సార్లు వాయిదాలు పడిన 'ఆక్సిజన్'.. గోపీచంద్ కెరీర్కి మళ్లీ ఆక్సిజన్ని అందిస్తుందేమో చూడాలి.