పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'జల్సా', 'అత్తారింటికి దారేది' వంటి విజయవంతమైన చిత్రాల తరవాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా.. పవన్కిది 25వ చిత్రం కావడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత ఎక్కువగానే ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. విశేషమేమిటంటే.. పవన్ గత సంక్రాంతి చిత్రం 'గోపాల గోపాల' (2015) కూడా అదే తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ తన కొత్త చిత్రం కూడా అదే తేదికి రావడం విశేషం. అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మానియేల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే పేరు వినిపిస్తోంది.