ఏపీ కేబినెట్లో ఇద్దరు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. ఉండవల్లిలోని ప్రజాదర్బార్ హాల్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలి సభ్యుడు ఎన్ఎమ్డీ ఫరూక్తో పాటు, కిడారి శ్రావణ్ కుమార్లు కొత్తగా మంత్రి వర్గంలో చేరారు. ఎన్ఎమ్డీ ఫరూక్ దైవ సాక్షిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా కిడారి శ్రవణ్ మాత్రం దైవ సాక్షిగా ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు.