తనపై సోషల్ మీడియా వేదికగా నటి శ్రీరెడ్డి అసత్య ఆరోపణలు చేస్తోందని.. తద్వారా తనపరువుకు భంగంకలుగుతోందని హీరో నానీ శ్రీరెడ్డి కి లీగల్ నోటీసు పంపించాడు. అవి అందుకున్న ఏడూ రోజుల్లో సిటీ సిటీ సివిల్ కోర్ట్ కు వివరణ ఇవ్వాలని నానీ తరుపు లాయర్లు సూచిస్తున్నారు. సదరు నోటీసులపై నటి శ్రీరెడ్డి ప్రతిస్పందించారు. నానిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాననీ.. గురువారం వీటిపై మాట్లాడతానని అన్నారు. నానీ తప్పు చేశాడా లేదా అన్నది తనకు నానితో దేవుడికి తెలుసన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వార్ కు సిద్ధంగా ఉండాలని అన్నారు.