ఏపీకి ప్రత్యేక హోదాపై మాట తప్పిన కేంద్రంపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ తనదైన స్టైల్లో నిరసన వ్యక్తం చేశారు. రకరకాల వేషాలు కట్టి నిరసన వ్యక్తం చేసే శివప్రసాద్ ఈసారి శ్రీవారి పరమ భక్తుడు అన్నమయ్య వేషంలో వచ్చారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాని మోడీ ఆ విషయం మరచిపోయారని శివప్రసాద్ ఆరోపించారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడి పాటకు పేరడీగా మోడీని ప్రశ్నించే శ్రీవారి భక్తుడిగా మోడీని ప్రశ్నిస్తూ ఓ అన్మమయ్య కీర్తన ఆలపించాడు. ఈ పోరాటానికి అంతా కలిసి రావాలని ఆయన కోరారు.