రోజా చెవిలో పూలు..

Update: 2018-01-10 10:33 GMT

యువతకు రెండు చెవుల్లో పూలు పెట్టి సీఎం చంద్రబాబు మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని దగా చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీలో రోజా పాల్గొన్నారు. ఆందోళనకారులు, రోజా చెవుల్లో పూలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్‌ విగ్రహనికి కు పూలమాల వేసి కరపత్రం అందజేశారు. టీడీపీ పాలనకు బుద్ధి చెప్పేందుకు యువత కదలిరావాలని రోజా పిలుపునిచ్చారు. 

Similar News