రోడ్డు మీద నాట్లేసిన రోజా

Update: 2018-09-19 09:14 GMT

నగరి ఎమ్మెల్యే రోజా వరినాట్లు వేసింది. కూలీలతో కలిసి సరదాగా నాట్లు వేశారనుకుంటే తప్పులో కాలేసినట్లు.   చిత్తూరు జిల్లా మేళపట్టు గ్రామంలో  నిన్న కురిసిన వర్షాలకు రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే రోజా.... వినూత్న రీతిలో రోడ్లపైనే నాట్లు వేసి నిరసన తెలిపారు. రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా  మేళపట్టు గ్రామంలో పర్యటించిన రోజా అక్కడి రోడ్ల దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ వీధిలోనే పరిస్థితి ఇంతదారుణంగా ఉంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ గొప్పలు చెప్పుకునే  అధికార పార్టీ నేతలు గ్రామాల్లో రోడ్లు పాడైన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగన్‌ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. 

Similar News