విద్యార్ధులు చదువులో ఆసక్తిని పెంపొందించుకోవాలి-ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి
విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చెప్పారు.
విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాలికల జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్చార్ధుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను అభినందించారు. విద్యార్ధులు చదువులో ఆసక్తిని పెంపొందించుకోవాలని.. నూతన ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.