కర్నూలు ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ విద్యార్ధుల నిరసన
కర్నూలు నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు.
కర్నూలు నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. ఎగ్జామ్ ఫీజు,క్లినికల్ ఫీజులు చెల్లించినా హాల్ టికెట్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులకు అండగా వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను కాలేజీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు. విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు విద్యార్ధుల ఆందోళనపై ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్ధి సంఘం నేతలు చెబుతున్నారు.