కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి

Update: 2018-09-05 05:59 GMT

విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే  పాముల పుష‌్ప శ్రీవాణి కన్నీరు పెట్టుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజన విద్యార్ధినులకు అందుతున్న వైద్యాన్ని తలుచుకుంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.  కొత్తవలస ఆశ్రమ పాఠశాలలో విషజ్వరాలకు గురైన విద్యార్ధినులకు అందిస్తున్న వైద్యసాయంపై కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు. బాబు గారి 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. 

Similar News