విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పీఏ గంటా మోహన్ రాసలీలలు వెలుగులోకివచ్చాయి. గతకొంతకాలంగా ఎమ్మెల్యే పీఏ అనే హోదాతో మహిళా కార్యకర్తలను లోబరుచుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఓ మహిళతో గంటా మోహన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే, కొన్నాళ్ల క్రితమే పీఏ మోహన్ భార్య.. తన భర్త మీద నున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా ఈ విషయంపై ఎమ్మెల్యే బోండా స్పందించకపోవడం కొసమెరుపు.