జగన్ నాటకం అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. ‘అతడు’ సినిమాలో సీన్ను జగన్ ఫాలో అయ్యారని సానుభూతి కోసం ప్రయత్నించారని విమర్శించారు. స్కెచ్లో భాగంగానే దాడి చేయించుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు భాష మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీ పోలీసులపై జగన్ నమ్మకం లేదంటారని వాంగ్మూలం ఇవ్వకుండా నిరాకరించడమేంటి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంటే గవర్నర్ పట్టించుకోరని మండిపడ్డారు. జగన్కు కోడికత్తి గుచ్చుకుంటే బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.